ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యాయత్నం కేసులో నిందితుడిగా మొహమ్మద్ ఫైజల్,,,కింది కోర్టు తీర్పును రద్దుచేసిన కేరళ హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 09:55 PM

హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ, ఎన్సీపీ నేత మొహమ్మద్‌ ఫైజల్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం పక్కనబెట్టింది. అంతేకాదు, కొత్తగా మళ్లీ ఈ కేసును పరిశీలించాలని కేరళ హైకోర్టును ఆదేశించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఇందుకు ఆరువారాల గడువు విధించింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్టయ్యింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ గడువులోగా లక్షద్వీప్ పరిపాలన విభాగం అప్పీల్‌ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.


ఈ కేసులో మొహమ్మద్ ఫైజల్‌ను దోషిగా నిర్ధారించి, విధించిన శిక్షను సస్పెండ్ చేయడంలో కేరళ హైకోర్టు అనుసరించిన విధానాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్‌ అల్లుడు మహ్మద్‌ సాలిహ్‌పై హత్యాయత్నం చేసినట్టు మహ్మద్‌ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై 2016 జనవరి 5న బాధితుల ఫిర్యాదు మేరకు అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే.. 2019 ఎన్నికల్లో లక్షద్వీప్ నుంచి ఆయన విజయం సాధించారు.


ఈ క్రమంలో కవరత్తి కోర్టు 2023 జనవరి 11న ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మొహమ్మద్ పార్లమెంట్ సభ్యత్వాన్ని జనవరి 1న లోక్‌సభ సచివాలయం రద్దు చేస్తూ.. అనర్హుడిగా ప్రకటించింది. అయితే, కింది కోర్టు తీర్పుపై ఫైజరల్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించింది. అది తప్పుడు కేసన్న పేర్కొన్న హైకోర్టు.. ఫైజల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశాన్ని పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


సభ్యత్వం పునరుద్ధరణ అంశంలో లోక్‌సభ సెక్రటేరియేట్‌ జాప్యం చేయడంతో మొహమ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ విచారణకు ముందు రోజు అంటే మార్చి 29న సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోటిఫికేషణ్ విడుదల చేసింది. మరోవైపు, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంతో లక్షద్వీప్ అధికార యంత్రాంగం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.


‘‘ఫైజల్‌కు ఉపశమనం ఇవ్వడం.. న్యాయ ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తుంది’’ అని లక్షద్వీప్‌ రిపాలన విభాగం వాదనలు వినిపించింది. సాలిహ్‌పై ఉద్దేశపూర్వకంగానే ఫైజల్‌తో పాటు మరికొందరు మారణాయుధాలతో దాడి చేశారని, ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులను చేర్చగా.. ఇద్దరు విచారణ సమయంలో మరణించారని లక్షద్వీప్‌ పరిపాలన విభాగం సుప్రీంకు నివేదించింది. చివరకు 35లో కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా నిర్ధారించిన కవరత్తి కోర్టు.. పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ మిగిలిన వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa