నేపాల్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం ధడింగ్ జిల్లాలో ఓ బస్సు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 19 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఖాట్మండుకు 60 కి.మీ దూరంలోని గజూరి వద్ద బస్సు అదుపు తప్పి త్రిశూలి నదిలోకి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa