ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖలో విచారణకి వచ్చిన కోడికత్తికేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 12:31 PM

 నేటి నుంచి విశాఖ ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ కోడి కత్తి కేసు విచారణ జరగనుంది. ఇప్పటివరకు విజయవాడలో జరిగిన కేసు విచారణ విశాఖకు బదిలీ చేయడం జరిగింది. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఆయనపై కోడికత్తితో దాడి జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణ ప్రారంభం కానుంది. కోడికత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు రావాలంటూ విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక ఈ రోజు ఉదయం 11 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa