ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ లోకి చేరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 03:12 PM

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం, మెంటాడ పంచాయతీ పరిధి అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన పలువురు  టీడీపీ నేత కిమిడి కళావెంకటరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... అరాచకాలకు, విధ్వంసాలకు కేరాఫ్‌గా వైసీపీ ప్రభుత్వం మారిందని, ఈ పాలనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్యపాన నిషేదమని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ తుంగలో తొక్కి, రూ.60 మద్యం సీసాను రూ.200 విక్రయించి పేదల ఆరోగ్యంతో పాటు డబ్బును దోచుకుంటున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లు పూర్తయినా రూ.3000 పింఛన్‌ హామీ నెరవేర్చలేని అసమర్థడు జగన్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa