రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే రాష్ట్ర ప్రజల భవిష్యత్ బంగారుమయం అవుతుందని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజి తెలిపారు. పామూరు మండలంలోని బోడవాడ పంచాయతీ అక్కంపేట గ్రామంలో అయన మాట్లాడుతూ.... చంద్రబాబు చేపట్టిన ప్రతి పథకాన్ని రద్దు చేయడమే జగన్ లక్ష్యమని, స్థానిక సంస్థల నిధులను పక్క దారి మళ్లిస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడని అన్నారు. జగన్ దుర్మార్గ పాలనపట్ల విసుగు చెందిన ప్రజలు చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కనిగిరి ఇన్చార్జి ఉగ్ర నరసింహారెడ్డిను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. టీడీపీ కనిగిరి ఇన్చార్జి ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ జగన్ మాయమాటలు నమ్మిమోసపోయామని, సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa