ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణాలో అనుమానితులు, రాష్ట్రంలో అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2023, 02:12 PM

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దీప్తి మర్డర్‌ కేసుకు సంబంధించి అనుమానితులు ఒంగోలులో దొరికారు. అందుకు సంబంధించిన ఇరువురిని ఓ లాడ్జిలో తెలంగాణ పో లీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్తి చెల్లెలు చందన ఆమె స్నేహితుడు స్థానిక 60 అడుగుల రోడ్డులో గల ఓ లాడ్జిలో ఉన్న విషయాన్ని సాంకేతికత ఆధారంగా గుర్తించిన పోలీసులు ఒంగోలు తాలూకా పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల హడావుడి నేపథ్యంలో స్థానికంగా కలకలం రేగింది. దీప్తి మృతి అనంతరం ఆమె సోదరి చందన కనిపించకపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు చందనతోపాటు ఆమె స్నేహితుడిని వెంటాడినట్లు సమాచారం. సెల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa