గుంటూరు జిల్లా, మంగళగిరిలోని 108 కాల్ సెంటర్ ఉద్యోగిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ ఆఫీస్లో అందరూ చూస్తుండగా ఉద్యోగి చెంపపై ఓఎస్డీ మదుసూధన్ రెడ్డి కొట్టినట్లు సమాచారం. అందుకు నిరసనగా నిన్న 15 నిమిషాల పాటు అత్యవసర కాల్స్ను నిలిపివేయడం జరిగింది. ఇలాంటి చర్యలు జరుగుతుంటే మాకు న్యాయం చెయ్యరా అని అధికారులని ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య శ్రీ అదనపు సీఈఓగా మధుసూధన్ రెడ్డి ఉన్నారు. మధుసూధన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa