ఏపీలో వచ్చే మూడు రోజుల్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు చోట్ల తేలిపాకటి నుంచి మోస్తర వర్షాలు కురిస్తాయని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ తుపాను ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, అనంతరం 48 గంటల్లో అది అల్పపీడనంగా మారొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నంద్యాల, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చన్నారు. శనివారం ఎనంద్యాల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, న్టీఆర్, చిత్తూరు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
ఇక తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీకి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa