టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎస్ఐ పోస్టుల భర్తీ మెయిన్ పరీక్షలకు సమయం ఇవ్వాలని డీజీపీకి లేఖ రాశారు. ప్రతి సంవత్సరం 6,500 ఉద్యోగాల కల్పన చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ఎన్నికల వస్తున్నా కారణంగా ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందని మండిపడ్డారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మార్చి నెలలో నిర్వహించాల్సిన ఫిజికల్ టెస్ట్లను అసంబద్ధంగా ఆగస్టు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్లు నిర్వహించారన్నారు. సెప్టెంబర్ 24న దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తుండగా, మెయిన్ పరీక్షలు అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మెయిన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంత తక్కువ వ్యవధి ఉండడం వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa