సీఎం జగన్రెడ్డి విదేశాలకు వెళ్లిన సమయంలో కూడా తన బాధ్యతల్ని ఉపముఖ్యమంత్రులకు ఇవ్వరా? అని టీడీపీ అధికారి ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ప్రత్యేక విమానంలో జగన్, సతీసమేతంగా తొమ్మిది రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లారు. వెళ్లేటప్పుడు తన సీఎం బాధ్యతల్ని ఎవరికైనా అప్పగించి వెళ్లాల్సింది. రాష్ట్రంలో ఏదైనా జరగరానిది జరిగితే, ప్రజలకు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు వస్తే... ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అధికార యంత్రాంగాన్ని ఎవరు నడిపిస్తారు? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఉపముఖ్యమంత్రులుగా నియమించామని గొప్పలు చేప్పే జగన్రెడ్డి.. వారిలో ఏ ఒక్కరినీ ఇన్చార్జి సీఎంగా ప్రకటించకపోవడానికి కారణం అధికారాలు ఆ వర్గాలకు ఇవ్వకుండా ఉండేందుకేనా? అనేది తెలపాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa