అమరావతిలో రాజధాని నిర్మాణంకోసం భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేలా ప్రభుత్వం, సీఆర్డీయేను ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య జాయింట్ సెక్రెటరీ కల్లం రాజశేఖర్రెడ్డి, రాజధాని రైతు పరిరక్షణ సమితి జాయింట్ సెక్రెటరీ ధనేకుల రామారావు హైకోర్టును ఆశ్రయించారు. సకాలంలో కౌలు చెల్లించకుండా జాప్యం చేసినందుకు 24శాతం వడ్డీ చెల్లించేలా ఆదేశించాలని కోరారు. చట్టనిబంధనలు అనుసరించని బాధ్యులైన అధికారుల నుంచి పిటిషనర్ల సొసైటీల సభ్యులకు పరిహారం ఇప్పించాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. కౌలు చెల్లింపులకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. దీంతో పిటిషనర్లు అప్పీల్ వేశారు. సోమవారం అది విచారణకు రాగా నోటీసుల దశలో అప్పీల్ వేయడంపై ధర్మాసనం అభ్యంతరం లేవనెత్తింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు.తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa