గిద్దలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధాకర్రెడ్డి అన్నారు. గిద్దలూరు ఎస్ఎస్ ప్లాజాలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యకర్తల సమావేశంలో, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రానున్నదని, రాహుల్గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పగడాల రంగస్వామి, సమన్వయకర్తలు చిలకల వెంకటేశ్వర్రెడ్డి, పోతంశెట్టి తిరుపాలయ్య, కాంగ్రెస్ నాయకులు జమాల్సాబ్, నాగేశ్వరరావు, శివరామక్రిష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa