ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన కాజా టోల్‌గేట్ రుసుములు ,,,, అమల్లోకి వచ్చాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 08:12 PM

గుంటూరు నుంచి విజయవాడ దారిలో వెళ్లే వాహనదారులకు ముఖ్యగమనిక. విజయవాడ-గుంటూరు మధ్య నేషనల్ హైవే 16పై కాజా దగ్గర ఉన్న టోల్‌ ప్లాజాలో రుసుములు పెరిగాయి. ఈ నెల ఒకటి నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. అక్కడి కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం గతంలో సెప్టెంబరు నుంచి అమల్లోకి రావడంతో.. ఏటా సెప్టెంబరులో రుసుములు పెంచుతున్నారు. పెరిగిన రుసుముల వివరాలు ఇలా ఉన్నాయి. ఒక వైపునకు కారుకి రూ.110 నుంచి రూ.120.. మినీ వాహనాలకు రూ.190 నుంచి రూ.205, బస్‌, లారీలకు రూ.375 నుంచి రూ.410, భారీ వాహనాలకు రూ.605 నుంచి రూ.660కి పెంచారు. టోల్‌ ప్లాజాల్లో సాధారణంగా ఏటా ఏప్రిల్‌ ఒకటి నుంచి టోల్‌ ఛార్జీలు 5-10 శాతం మధ్య పెంచుతారు. కొన్ని టోల్‌ ప్లాజాల్లో మాత్రం ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందో ఆ నెల నుంచి టోల్‌ ఛార్జీలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. గుంటూరు విజయవాడ మధ్య ఈ కాజా టోల్‌గేట్ ఉంటుంది. ఈ హైవే ఎప్పుడూ రద్దీగా ఉండటంతో వాహనాలరాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటుంది. విశాఖ, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ నుంచి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి వెళ్లే వాహనాలు ఈ టోల్‌గేట్‌ను దాటుకుని వెళ్లాల్సిందే. అందుకే ఈ టోల్ ప్లాజా దగ్గర ఎప్పుడూ రద్దీ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa