తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ల పర్యటనలు అడ్డుకోవటమే లక్ష్యంగా పోలీసులు, వైసీపీ రౌడీలు పాల్పడుతున్న అరాచకాలు, రెచ్చగొట్టే ధోరణికి ప్రజలే తిరగబడే రోజు వస్తుందని మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడ పట్టణంలో నెట్టెం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ, భీమవరం బేతపూడి గ్రామం వద్ద యువగళం క్యాంప్లో విశ్రాంతి తీసుకుంటున్న వలంటీర్లపై దౌర్జన్యానికి పాల్పడటం, అక్రమంగా అరెస్టు చేయటంపై నెట్టెం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐపీసీ బదులు వైసీపీ కోడ్ అమలవుతోందన్నారు. వలంటీర్లపై దాడిచేసిన వైసీపీ గూండాలను గుర్తించి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa