ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులు ప్రభుత్వానికి అనుగుణ్ణంగా ప్రవర్తిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 07, 2023, 04:56 PM

లోకేష్‌ యువగళం పాదయాత్రకు రక్షణగా నిలుస్తున్న వలంటీర్లను అరెస్ట్‌ చేయటం అప్రజాస్వామికమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఈమేరకు బుధవారం ఓప్రకటన విడుదలచేశారు. వైసీపీ రౌడీ మూకలే దాడి చేసి, వారే వలంటీర్లపై అక్రమ కేసులు పెట్టించి అరెస్ట్‌ చేయటం జగన్మోహన్‌రెడ్డి సైకోతనానికి నిదర్శనం అని విమర్శించారు. పోలీసుల నిర్లక్ష్యం, ఏకపక్ష వైఖరితోనే పాదయాత్రపై వైసీపీ మూకల దాడి జరిగిందన్నారు. యువగళం ప్రజాగళంగా మారడాన్ని జగన్మోహనరెడ్డి, వైసీపీ సైకోలు ఓర్చుకోలేక దాడులు చేస్తున్నారన్నారు. ప్రశాంతమైన గోదావరి జిల్లాలలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఫ్యాక్షనిజాన్ని వైసీపీ సైకోలు సృష్టిస్తున్నారన్నారు. సీఎం సభలు, సమావేశాలకు టీడీపీ జెండాలతో హాజరైతే పోలీసులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. పాదయాత్రలో లోకేష్‌పై వైసీపీ కార్యకర్తలు రాడ్లు, సీసాలు, కర్రలతో దాడికి దిగితే పోలీసులు ఎందుకు నిరోధించలేదన్నారు. జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తే టీడీపీ ప్రభుత్వం సహకరించిందన్నారు. దాడికి యత్నించిన వారిని వదిలేసి, ప్రతిఘటించిన వారిని అర్ధరాత్రి అరెస్ట్‌ చేసి రోడ్లపై తిప్పారన్నారు. పాదయాత్రలో పాల్గొన్న నాయకులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. సర్వే సంస్థలు వైసీపీ ఓటమి తప్పదని ఇచ్చిన రిపోర్టులపై ఆందోళనతో ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతున్నారన్నారు. అరెస్ట్‌ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే రవికుమార్‌ డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa