ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే అరెస్ట్ చేసాం, వివరణ ఇచ్చిన సీఐడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 09, 2023, 02:04 PM

స్కిల్‌ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరిట 550 కోట్ల స్కామ్ జరిగిందని.. దీంతో ప్రభుత్వానికి 371 కోట్ల నష్టం వచ్చిందని ఏపీ సీఐడీ డీజీ సంజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై సీఐడీ డీజీ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఇన్ వాయిస్ ద్వారా సెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తెలిపారు. అలాగే తమ దర్యాప్తులో ప్రధాన నిందితుడు చంద్రబాబునాయుడే అని తేలిందన్నారు. అన్ని లావాదేవవీలు చంద్రబాబుకు తెలిసే జరిగినట్లు చెప్పారు. అలాగే ఈ స్కామ్‌కు సంబంధించి కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని ఆరోపించారని తెలిపారు. ఈడీ, జీఎస్‌టీ ఏజెన్సీలు కూడా ఈ స్కాంపై దర్యాప్తు చేశాయన్నారు. అంతేగాక ఈ స్కామ్‌లో ఫైనల్ బెనిఫిషరీ కూడా చంద్రబాబే అని, న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. 2014 జూలై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ముందే డిజైన్ టెక్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంస్థ బాధ్యతలు గంట సుబ్బారావు అప్పగిస్తూ ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారని చెప్పారు. లోకేష్ పాత్రతో పాటు ఇతరుల పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై విచారణ చేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa