లాంగ్ వీకెండ్తో కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. అన్ని కంపార్టుమెంటులు భక్తులతో నిండిపోగా... వైకుంఠ క్యూ కాంప్లెక్స్ను దాటి 5 కిలోమీటర్ల మేర బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 48 గంటలకుపైగా సమయం పడుతోంది. శనివారం 87,081 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం సమకూరినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అలాగే, మొత్తం 41,757 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు తెలిపింది. రద్దీ నేపథ్యంలో సర్వదర్శన టోకెన్లను అక్టోబరు 1, 7,8,14, 15 తేదీల్లో నిలిపివేసినట్టు టీటీడీ వెల్లడించింది.
మరోవైపు, ఆదివారం ఉదయం అలిపిరి లింక్ బస్టాండులో తిరుమలకు బస్సులు లేక భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి ఆలయం మొదలుకుని.. మాడవీధులు, లడ్డూ కౌంటర్, అన్నప్రసాద భవనాలు భక్తులతో నిండిపోయాయి. గదులకు కూడా దొరకని పరిస్థితి నెలకుంది. గదిని పొందేందుకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. గదులు లభించనివారు ఫుట్పాత్లపై, కార్యాలయాల ముందు, చెట్ల కింద, షెడ్లలో సేదదీరుతున్నారు. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో రెండు నడక మార్గాలు రద్దీగా మారాయి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి షెడ్లన్నీ సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనాల నుంచి రింగురోడ్డులో శిలాతోరణంగా మీదుగా నందకం వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర క్యూలైన్ వ్యాపించింది. వీరికి 48 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. తిరుమలకు వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాహనాలను తిరుమలలోకి రాకుండా రింగురోడ్డు ద్వారానే పార్కింగ్ ప్రాంతాలకు మళ్లించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa