మధ్య ఆదాయ వర్గాలకు అనువుగా మంగళగిరి, నూజివీడుల్లో అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్లోని ప్లాట్లను ఈ–వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ప్లాట్ల కొనుగోలు గడువును అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళగిరి స్టేడియం పక్కనే ఉన్న టౌన్షిప్లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 200 చదరపు గజాల్లో 68, 240 చదరపు గజాల్లో 199 ఉన్నాయన్నారు. చదరపు గజం రూ.17,499గా నిర్ణయించినట్లు చెప్పారు. నూజివీడులో చదరపు గజం రూ.8,500లకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సులభ వాయిదాల్లో నగదు చెల్లించే సౌలభ్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు అక్టోబరు 31లోగా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. వివరాలకు 0866-2527124 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు లే–అవుట్లోని 10 శాతం ప్లాట్లు రిజర్వు చేసినట్లు చెప్పారు. అలాగే 20 శాతం రాయితీ కూడా కల్పిస్తున్నామన్నారు. విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వు చేసినట్లు వెల్లడించారు. ఆసక్తి గలవారు ప్లాట్ ధరలో 10 శాతం మొత్తం చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవచ్చనని చెప్పారు. అందిన దరఖాస్తులకు ఈ–లాటరీ నిర్వహిస్తామని, అందులో ఎంపికైనవారు ప్లాట్ కేటాయించిన నెలలోపు ఒప్పందం చేసుకుని ధరలో 30 శాతం సొమ్ము చెల్లించాలన్నారు. అనంతరం 6 నెలల్లో మరో 30 శాతం మొత్తం, ఏడాదిలోపు మిగిలిన 30 శాతం మొత్తం ధర చెల్లించవచ్చునని అన్నారు. ప్లాట్కు మొత్తం ధర చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు వివేక్ యాదవ్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa