తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక చేసింది. పెరటాసి నెల, వరుస సెలవులు రావటంతో.. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో.. కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటింటింది. అక్టోబరు 1, 7, 8, 14, 15వ తేదీల్లో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ సంస్థ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని యాజమాన్యం కోరింది.
అయితే.. శ్రీవారి దర్శనానికి శనివారం రోజున భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెరటాసి మాసం కావటం అందులోనూ శనివారం కావటంతో.. తమిళనాడు నుంచి శ్రీవారి భక్తులు భారీగా వచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలకు పైగానే సమయం పడుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేర క్యూలైన్లు విస్తరించాయంటే.. ఎంత మంది భక్తులు వచ్చారో అర్థం చేసుకోవచ్చు.
దీంతో.. క్యూలెన్లలో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదం, తాగునీరు అందిస్తున్నారు. అయినప్పటికీ.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంటిపిల్లల తల్లులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట ఎండతోనూ.. రాత్రి పూట చలితో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. తర్వాతి శనివారం నుంచి సర్వదర్శనం టోకెన్లు నిలివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa