ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడు...నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2023, 07:13 PM

 ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. అధికార మదమెక్కిన జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదని వ్యాఖ్యానించారు. సైకో పోయి సైకిల్ వచ్చినప్పుడు జగన్ పిచ్చి కుదురుతుందని లోకేశ్ వివరించారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రేపు నారా లోకేశ్ ఢిల్లీలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనుండడం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa