తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం (అక్టోబర్ 2) ఉదయం నుంచి శ్రీకాళహస్తికి భక్తులు క్యూ కట్టారు. స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నం వరకే 30 వేల మంది పైగా దర్శనం చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాహు కేతు పూజలు రికార్డు స్థాయిలో జరుగుతున్నట్లు తెలిపారు. 500 రూపాయలు, 750 రూపాయల టికెట్కు సంబంధించిన మండపాలను రెండు విభాగాలుగా చేసి, పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులను తాకిడిని క్రమబద్దీకరించడానికి ఆలయ అధికారులు పోలీసుల సహాయం తీసుకున్నారు.
సోమవారం సహజంగానే భక్తుల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అటు తిరుపతి నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీకాళహస్తి క్షేత్రానికి వస్తున్నారు. దర్శనం వేగంగా పూర్తయ్యేవిధంగా అధికారులు, ఆలయ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. క్యూలైన్ల సంఖ్యను పెంచారు. శ్రీకాళహస్తి ఆలయ ఈవో సాగర్ బాబు, వన్ టైన్ సీఐ అంజి యాదవ్.. క్యూ లైన్ల దగ్గర ఉండి, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa