ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అచ్చెన్నాయుడు లేఖపై స్పందించిన ఎలక్షన్ కమిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 02:18 PM

ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది. తీసుకున్న చర్యలపై అచ్చెన్నాయుడుకి చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా లేఖ రాశారు. పర్చూరులో వేరే వ్యక్తుల పేర్లపై ఆన్‌లైన్‌లో ఫామ్-7 లు పంపిన 12 మంది పై క్రిమినల్ కేసులను నమోదు చేశారు. ఇప్పటికే పర్చూరు ఈఆర్వో పిర్యాదు చేశారని లేఖలో కమిషన్ పేర్కొంది. బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చారని మీనా పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం నకిలీ ఫామ్-7 లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకున్నట్టు మీనా పేర్కొన్నారు. కావలి నియోజకవర్గంలో అక్రమాలపై అచ్చెన్నాయుడు రాసిన లేఖపై కూడా కమిషన్ స్పందించింది. కావలిలో కూడా బల్క్ గా ఫామ్-7 లు ఇచ్చి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని పేర్కొంటూ లేఖ రాశారు. కావలిలో అక్రమాలపై విచారణకు ఆదేశించినట్లు కమిషన్ పేర్కొన్నారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు లేఖలో సీఈవో మీనా వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa