ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి జంట హత్యల కేసు.. నమ్మకంగా హోటల్‌కు పిలిచి, ఆ కారణంతోనే దారుణంగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 07:10 PM

తిరుపతిలో కలకలంరేపిన జంట హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమికంగా ఈ కేసులో కొన్ని అంశాలపై క్లారిటీ వచ్చింది. మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా టరోడా కూడ్‌లోని నవజీవన్‌ నగర్‌కు చెందిన యువరాజ్‌ సంభాజి నార్వాడే భార్య మనీషా, బావమరిది హర్షవర్ధన్‌, ఆరేళ్ల కుమారుడు పక్షమ్‌, నాలుగేళ్ల కుమార్తె ప్రజ్ఞాన్‌తో కలసి తిరుపతి వచ్చారు. వీరు శ్రీకపిలేశ్వర స్వామి ఆలయ సమీపంలోని హోటల్‌కు గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో గది తీసుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చినట్లు హోటల్‌లో వివరాలను నమోదు చేశారు. రాత్రికి హోటల్‌ గదికి భోజనం తెప్పించుకుని తిన్నారు. ఆ తర్వాత భార్యాభర్తలు కొడుకుతో కలసి సెల్ఫీ తీసుకున్నారు. శుక్రవారం ఉదయానికి హోటల్‌లో జంట హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.


యువరాజ్‌కు ఎనిమిదేళ్ల కిందట మనీషాతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. భార్య మనీషా ప్రవర్తనపై భర్త యువరాజ్‌కు అనుమానం వచ్చింది. కొంతకాలంగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిగా అతడు ఇల్లు వదిలి బయట ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం తిరుపతికి వచ్చాడు. ఈ క్రమంలో యువరాజ్ బామ్మర్ది హర్షవర్ధన్‌ అక్క భావ మధ్య విభేదాలు తొలగించాలని భావించాడు. బావకు ఫోన్‌ చేసి మాట్లాడాడు.. మాట్లాడుకుందామని చెప్పాడు. తాను తిరుపతిలో ఉన్నానని.. ఇక్కడికి వస్తే మాట్లాడుకుందామని చెప్పాడు. దీంతో హర్ష అక్క, ఇద్దరు పిల్లలను తీసుకుని తిరుపతికి వచ్చాడు. అక్కడ గురువారం రాత్రి విభేదాలపై చర్చ జరిగింది.గురువారం తెల్లవారుజామున యువరాజ్ ముందే తెచ్చిన కత్తితో భార్య, బావమరిదిపై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయారు.


భార్యాను, బావమరిదిని హత్య చేసిన యువరాజ్ స్వయంగా 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. హత్య తర్వాత ఇద్దరు పిల్లలతో అదే గదిలో తెల్లవారే వరకు ఉన్నాడు. ఆ తర్వాత పిల్లల్ని పోలీస్ స్టేషన్ దగ్గర వదిలి పారిపోయాడు. నిందితుడి అన్నతో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై మృతుల బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి మృతదేహాలను అప్పగించనున్నారు. తల్లి కనిపించకపోవడంతో రెండేళ్ల కూతూరు ఏడుస్తుండటం అందర్నీ కలిచివేసింది. మహిళా పోలీసులే ఆ ఇద్దరు పిల్లలను బుజ్జగించి భోజనం తినిపించారు. నాందేడ్‌ నుంచి బంధువులు వస్తే పిల్లలను వారికి అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు. అలాగే యువరాజ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. అతడిని పట్టుకుంటే కానీ హత్యకు కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa