ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులు ఈ కేవైసీ, ఈ క్రాప్ పూర్తి చేయాలి,,,,,ఈ నెలలోనే డబ్బుల్ని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 07:38 PM

ఏపీలో రైతులకు ముఖ్య గమనిక.. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసినందున ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియను ఈ నెల 10నాటికి పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 97 శాతం ఈ–క్రాప్‌ నమోదు, 70 శాతం రైతుల ఈ–కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులు మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల 10 నాటికి ఈ–కేవైసీ పూర్తిచేయాలన్నారు. ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ–క్రాప్‌ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలి అన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలన్నారు. సామాజిక తనిఖీ తర్వాత ఈ నెల 20న తుది జాబితా ప్రదర్శించాలి అన్నారు. అక్టోబర్‌ రెండోవారం కానీ, ఆ తర్వాత కానీ జమ చేయనున్న పీఎం కిసాన్‌ 15వ విడత సాయం కోసం.. అర్హత ఉన్న రైతులందరూ ఆధార్‌తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ–కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15నాటికి వాటిని సరిచేసుకోవాలని కోరారు. అంటే ఈ నెల రెండో వారంలో అకౌంట్‌లలో డబ్బులు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు.


అధికారులు యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాలని సూచనలు చేశారు. ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలు దారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి కిసాన్‌ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్‌ల శిక్షణ కోసం జారీచేసిన మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామన్నారు. పాస్‌పోర్ట్‌ నిబంధనను తొలగించామని.. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్‌సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవాలి అన్నారు. గ్యాప్‌ పొలంబడులకు ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ ప్రొడ్యూసర్స్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు హరి కిరణ్. రైతులు కూడా ఈ విషయాలను గమనించి.. అందుకు తగినట్లుగా పెండింగ్ పనుల్ని పూర్తి చేయాలన్నారు.


జగన్ సర్కార్ పీఎం కిసాన్ వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏడాది రైతులకు జగన్ ప్రభుత్వం రూ.13,500 ఆర్ధిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ నిధులతో కలిపి.. ఏడాదికి మూడు దఫాలుగా ఈ సాయాన్ని అకౌంట్‌లో జమ చేస్తోంది ప్రభుత్వం. తొలి విడత కింద రూ.7,500, రెండో విడత రూ.4 వేలు, మూడో విడత రూ.2 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa