ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉండి తప్పు చేసి జైలుకెళ్లారన్నారు. జైలుకెళ్లిన ఏ నాయకుడైనా బతికిబట్ట కట్టలేదని.. తిరిగి అధికారంలోకి రాలేదన్నారు. పల్నాడు జిల్లా నకరికల్లులో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నా డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి చూశారుగా అన్నారు. ఒకరు ఇద్దరు తప్ప ఎవరూ అధికారంలోకి తిరిగి రాలేదన్నారు. అలాంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతిస్తున్నారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతిచ్చి మునిగిపోయే పడవను లేపుతామని పవన్ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు జైలుకుపోవడంతో టీడీపీ బలహీనపడిందని పవన్.. సానుభూతి పెరిగిందని టీడీపీ చెబుతున్నారన్నారు. పవన్కు డబ్బు అవసరం లేదంటూనే ఎందుకు టీడీపీకి మద్దతు పలుకుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రెండుచోట్లా ఓడిపోయిన పవన్కు ఒక్క సీటు కూడా రాదని.. వైఎస్సార్సీపీ 175 సీట్లలో గెలవటం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి చంద్రబాబే కారణమన్నారు. మంత్రి అంబటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa