ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలను లోకేశ్ కించపరిచాడు...విజయసాయిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 11:44 PM

ఏపీ ప్రజలను తీవ్రంగా కించపరిచాడని టీడీపీ యువనేత నారా లోకేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ గంజాయి రాజధాని అని, దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని లోకేశ్ చెప్పాడని వివర్శించారు. ఏపీని, రాష్ట్ర ప్రజలను లోకేశ్ కించపరిచారని మండిపడ్డారు. మీరు ఏపీకి పురస్కారాలు తీసుకురాకపోయినా పర్వాలేదు, కనీసం మమ్మల్ని కించపరచకుండా ఉండండి అని చెప్పారు. సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa