ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలస్తీనా కు మద్దతుగా మియా ఖలీఫా ట్వీట్

international |  Suryaa Desk  | Published : Sun, Oct 08, 2023, 10:54 PM

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య హోరాహోరీ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ పైకి గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడులకు ఇజ్రాయెల్ సైన్యం కూడా ప్రతిగా దాడులు చేస్తోంది. దీంతో ఇరు వైపుల నుంచి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్ ఉగ్రవాదుల దాడులను అంతర్జాతీయంగా చాలా దేశాలు ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోర్న్‌స్టార్ మియా ఖలీఫా చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే ఆమె హమాస్ ఉగ్రవాదులు చేసిన పనిని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది.


ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంపై ప్రపంచంలోని వివిధ దేశాలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నాయి. వివిధ దేశాల అధినేతలతోపాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించాయి. మరోవైపు.. ఇరాన్, సిరియా, యెమెన్ వంటి అరబ్ దేశాలు హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను సమర్థించాయి.


అయితే ఈ యుద్ధంపై ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. పాలస్తీనాకు మద్దతుగా మియా ఖలీఫా ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. "పాలస్తీనాలోని పరిస్థితులను చూసి ఇప్పటికీ మీరు పాలస్తీనియన్ల వైపు ఉండకపోతే.. మీరు తప్పుడు మార్గంలో ఉన్నారని అర్థం. అలాంటి వారికి కాలమే తగిన సమాధానం చెప్తుంది’’ అంటూ మియా ఖలీఫా రాసుకొచ్చింది. ప్రస్తుతం మియా ఖలీఫా చేసిన ట్వీట్‌ను చూస్తే ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడిని సమర్థిస్తున్నట్టు అర్థం అవుతోంది. ఒకవైపు అగ్రరాజ్యాలతో పాటు ఇతర ప్రముఖులందరూ హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులను వ్యతిరేకిస్తుంటే మియా ఖలిఫా మాత్రం వారికి మద్దతు ప్రకటించడం సోషల్ మీడియాలో పెను దుమారానికి దారి తీసింది.


ముందుగా దాడి చేసింది హమాస్ ఉగ్రవాదులు అని.. వారికి ఎలా మద్దతు తెలుపుతావంటూ మియా ఖలీఫాకు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్లకు మియా ఖలీఫా సైతం దీటుగానే బదులిస్తోంది. హమాస్ దాడి ముమ్మాటికీ తప్పేనని వాదిస్తున్న వారికి.. చరిత్రపై జ్ఞానోదయం కూడా కల్పిస్తోందని పేర్కొంది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉన్న ప్రజలు ఎక్కడి నుంచో వచ్చి పాలస్తీనాలో నివసిస్తున్నారని.. స్థిరపడిన వారిని పౌరులుగా పరిగణించరంటూ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లా ను గుర్తు చేసింది. పాలస్తీనియులకు అన్యాయం జరిగిందని.. వారికి మద్దతుగా నిలవాల్సిందేనని మియా ఖలీఫా తెలిపింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. అరబ్ పౌరులపై బాంబులు వేయడం బైడెన్‌కు ఎంతో ఇష్టమంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa