రాష్ట్ర రాజధానిపై 2014లో జగన్ ఏమి మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకొని ప్రవర్తించాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అప్పుడు అమరావతి రాజధానిని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్న జగన్ చేసిన వ్యాఖ్యలను మీడియాకు అయన వినిపించారు. ‘99 శాతం ప్రజలు జగన్ విశాఖకు రావద్దని అంటున్నారు. కావాలంటే ప్రజా అభిప్రాయం సేకరణ చేయండి. విశాఖను పరిపాలన రాజధాని చేస్తే అభివృద్ధి జరుగుతుందని తొలుత స్వాగతించాము. కానీ ఇప్పటి వరకూ ఒక ఇటుక కూడా వేయలేదు. గండికోట రహస్యంలా రుషి కొండ వ్యవహారం ఉంది. రుషికొండలో వాడిన మెటీరియల్ చాలా విలువైనవి ఉన్నాయి. బాత్రూం కమోడు రూ.25 లక్షలతో నిర్మించారంటే.. మిగిలిన విషయాలు ఆలోచించుకోవచ్చు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa