సెంట్రల్ జైలు సాక్షిగా టీడీపీ, జనసేన మధ్య పొత్తు రాజమహేంద్రవరంలో ఖరారైన సంగతి తెలిసిందే. చంద్ర బాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన మూడో రోజు జనసేన అధినేత పవన్కల్యాణ్ స్వయంగా రాజమహేంద్రవరం వచ్చి, నారా లోకేశ్తో కలిసి చంద్రబాబును ములాఖత్లో కలిశారు. బయటకు వచ్చిన వెంటనే పొత్తు ఖరారు చేశారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఇంకా జైలులో ఉండడం వల్ల టీడీపీ- జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్కల్యాణ్ హాజరుకానున్నారు. ఇక వచ్చే ఎన్నికల కోసం ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారానే ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. ప్రజాసమ స్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యా చరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరుపార్టీల సమన్వ యంపై ఇక్కడ చర్చించనున్నారు .మంజీరా ఇంటర్నేషన్ హోటల్లో సమావేశం ఉండవచ్చని సమాచారం. అధికారికంగా వేదిక ఖరారు కావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa