ప్రభుత్వంలో ఉన్న మేం ఇవాళ జవాబుదారీగా మేం ఎప్పటికప్పుడు ఏం చేశామో అన్నది ప్రజలకు తెలియజేయాలి. అందులో భాగంగా సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నాం అని మంత్రి ధర్మాన అన్నారు. ఇవాళ మేం చేస్తున్న పాలన దేశంలో ఓ కొత్త ఒరవడి సృష్టించింది. మిగతా రాష్ట్రాలు ఈ తరహా పాలనను అందించలేకపోయాయి. ఈ స్థితిలో తమ రాష్ట్రాలలో పాలనను అందించలేకపోయాయి. ఇది రాజకీయ చైతన్యం ఉన్న వారు గ్రహించి మిగతావాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నో సార్లు శాసన సభలో చెప్పాను. అలానే రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను కోల్పోతే వాటిని పొందేందుకు కోర్టులకు వెళ్లి కోరుకుంటారు. కోర్టుల ద్వారా హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తారు. కానీ అదే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అన్నవి ఉన్నాయి. ఒక ప్రభుత్వం ప్రజల అవసరాలు ఎలా తీర్చాలన్నది కూడా రాజ్యాంగం అందించిన బాధ్యతే అది. కానీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో రాజ్యాంగ బాధ్యతలను ఏనాడూ పూర్తి చేసిన సందర్భం గడిచిన 75 ఏళ్లలో ఏనాడూ లేదు. అందుకే ఈ రాష్ట్రంలో అయితే పౌరులకు ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. ఓ నివాస యోగ్యమయిన ఇల్లు ను కట్టించే బాధ్యత ను మన రాజ్యాంగం ఇచ్చింది. ఇందులో భాగంగా 32 లక్షల మందికి స్థలాలు ఇచ్చి ఇళ్లను మంజూరు చేసింది ఈ ప్రభుత్వం. నాకు ఇల్లు లేదు, నా తండ్రికి ఇల్లు లేదు. నా తాతకు ఇల్లు లేదు అని బాధపడిన వారికి,ఇదేనా స్వాతంత్ర్యానికి అర్థం... ఇలానే మా జీవితాలు గడిచి పోవాల్సిందే అని బాధపడిన వారికి ఇళ్లు మంజూరు చేశాం. అన్ని వర్గాలకూ మేలు కలిగే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిగిలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా పాలన చేశాం. కేవలం పథకాల లబ్ధిదారులుగా ఈనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాదు అందరూ ఉన్నారు. దీనిని మీరు గుర్తించాలి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa