ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరంపై ప్రత్యేక సమీక్షకి సిద్ధమైన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 28, 2023, 01:54 PM

పోలవరం ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరులో మిగిలిన పనులు చేపట్టేందుకు అయ్యే వ్యయంపై సమగ్ర అంచనాల రూపకల్పనకు రాష్ట్ర జల వనరుల శాఖ శనివారం ప్రత్యేకంగా భేటీ కానుంది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజనీరు సుధాకరబాబు తదితరులు హాజరవుతారు. 41.15 మీటర్ల కాంటూరులో మిగిలిన పనుల పూర్తికి రూ.19,144 కోట్లు వ్యయమవుతాయని ఇప్పటికే జల వనరుల శాఖ కేంద్రానికి నివేదించింది. కేంద్ర జల సంఘం దానిని రూ.15,625 కోట్లకు కుదించింది. మొత్తంగా తొలిదశ పూర్తికి రూ.31,625 కోట్లు ఖర్చవుతాయని పేర్కొంది. తన ప్రతిపాదనలను అధ్యయనం కోసం అంచనాల సవరణ కమిటీకి పంపింది. ఇదే సమయంలో.. 41.15 మీటర్ల కాంటూరులో హెడ్‌వర్క్స్‌ సహా భూసేకరణ, సహాయ పునరావస కార్యక్రమాలకు ఎంత వ్యయమవుతుందో సవివరంగా వారం రోజుల్లోగా పంపాలని రాష్ట్రాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం నాటి భేటీలో జలవనరుల శాఖ పనుల వారీగా తుది అంచనాలు సిద్ధం చేసి కేంద్రానికి పంపుతుంది. ఇక ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన పనులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) తాలూకు ముసాయిదాను సిద్ధం చేసి పీపీఏకి పంపింది. అథారిటీ దీనిని పరిశీలించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa