విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రతి కాంట్రాక్ట్దారుడి నుంచి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు ముడుపులు అందుతున్నాయని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న ఆరోపించారు.ఆయన మాట్లాడుతూ.... వెలంపల్లి వల్ల దసరా ఉత్సవాల్లో అమ్మవారి ఆదాయానికి భారీగా గండిపడిందన్నారు. అతని ఇంటివద్ద కారులు పెట్టి జనాన్ని తరలించారని, వారిని రూ.500 వీఐపీ దర్శ నాల్లో పంపి, వారి చేతిలో రూ.వంద టికెట్ పెట్టారన్నారు. మిగతా రూ.400 ఎవరిజేబులోకి వెళ్లాయో చెప్పాలన్నారు. వెలంపల్లి అవినీతిని అరికట్టేందుకు స్వయంగా దేవదాయ మంత్రి గుడిపైనే ఉండడం విశేషమన్నారు. తెప్పోత్సవంలోనూ రాజకీయనాయకులు ఉండడం మున్నెన్నడూ లేదన్నారు. వెలంపల్లి అరాచకాలను ఆరికట్టకపోతే గుడిలో ఈవో కార్యాలయం ముందు తాము ధర్నా చేస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa