తిరుమల శ్రీవారి ట్రస్ట్కు భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. కర్ణాటక రాష్ట్రం హరోహల్లికి చెందిన ఆర్కిడ్ లామినేట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ తరఫున ప్రతినిధి టి బాలసుదర్శన్రెడ్డి బర్డ్ ట్రస్టుకు రూ.70 లక్షలా ఏడు వేలా 700 విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవీ ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఏడు కొండలకు సూచికగా ఈ విరాళాన్ని అందించినట్టు దాత తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లి రెడ్డెప్పరెడ్డి పాల్గొన్నారు.
ధర్మప్రచారంలో భాగంగా నవంబరు 20న తిరుపతి, 27న కర్నూలు, డిసెంబరు 4న వైజాగ్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం ఈవో కార్తీక దీపోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాతల సహకారంతో ఈ మూడు ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
కార్తీక దీపోత్సవాల కోసం ఆయా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సహకారం తీసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులతో సంప్రదించి దీపోత్సవానికి అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దీపోత్సవ కార్యక్రమ సరళిపై సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కువ మంది భక్తులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa