ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీల సమస్యలు ప్రస్తావిస్తే చంద్రబాబు తోకలు కత్తిరిస్తానన్నాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 09, 2023, 01:54 PM

వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ... మన పిల్లలు చదువుకోవాలంటే కచ్చితంగా జగనన్న రావాలి.రాష్ర్టంలో రైతులు బాగుండాలంటే, నాడు – నేడు స్కూళ్లు బాగుండాలంటే, ప్రతి పేదవాడి పిల్లాడూ ఐఏఎస్, ఐపీఎస్‌లు అవ్వాలంటే, మంచి వైద్యం కావాలంటే, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు బాగుండాలంటే జగనన్న కావాలి.  బీసీల సమస్యలు ప్రస్తావిస్తే చంద్రబాబు తోకలు కత్తిరిస్తానన్నాడు. ఎస్సీ  కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు. ఎస్సీలు చంద్రబాబుకు ఓట్లేస్తారా?  మైనార్టీలను వైయస్ రాజశేఖరరెడ్డి మరువలేదు. చంద్రబాబు గుర్తుపెట్టుకోలేదు.  చంద్రబాబు మన జీవితాలతో ఆడుకున్నాడు. సంపద దోచుకుని సింగపూర్, మలేషియాలో దాచాడు. వంగవీటి రంగాను పొట్టనపెట్టుకున్న చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ కలిసిపోతున్నాడు.  ఇవాళ సురేష్‌ అనే వాడు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే జగనన్నే కారణం. అమరావతి ప్రాంతంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలపై కేసులు పెట్టి జైల్లో కూర్చోబెట్టాడు చంద్రబాబు.  జగనన్న వచ్చిన తర్వాత...  ఎస్సీలంటే, బీసీలంటే, మైనార్టీలంటే గౌరవం, రోషం కలిగిన వాళ్లు, వాళ్లు కూర్చోవాల్సింది పార్లమెంటులో అని అక్కడ కూర్చోబెట్టారు. నన్ను డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ను చేసిన ఘనత జగనన్నది.  విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్‌ గారి విగ్రహం తాడేపల్లివైపు చూపిస్తుంటుంది. నా ఆశయాలతో మీ జీవితాల్ని బాగు చేసే వ్యక్తి తాడేపల్లిలో ఉన్నాడని చూపిస్తుంటుంది.  భవిష్యత్‌లో జగనన్న ముఖ్యమంత్రిగా 20–25 సంవత్సరాలు ఉండాలి. మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదాకా అండగా ఉంటారు.  చంద్రబాబు 600 హామీలిచ్చి 10 కూడా నెరవేర్చలేదు. జగనన్న నవరత్నాల ద్వారా 99 శాతం హామీలు నెరవేర్చారు అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa