ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విచ్చలవిడిగా ఇసుక కుంభకోణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 13, 2023, 02:58 PM

దొంగ వే బిల్స్‌తో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారంటూ నక్కా ఆనంద్ బాబు ఆధారాలు బయటపెట్టారు. కలకత్తా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో పెద్ద కుంభకోణమని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట గొట్టి మరీ వేల కోట్లు ఇసుక ద్వారా దోచుకున్నారన్నారు. ఇసుక కుంభకోణం డబ్బుతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నాడని పేర్కొన్నారు. ఏపీఎండీసీ వీసీ, డైరెక్టర్ గా ఉన్న వెంకటరామిరెడ్డే ప్రతి ఇసుక అక్రమ తవ్వకంలోనూ ప్రధాన వాటాదారు అని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి వచ్చిన వెంకటరామిరెడ్డి, తెలుగుదేశం ఇచ్చిన ఉచిత ఇసుక విధానంలో అవినీతి అని ఫిర్యాదు చేశాడన్నారు. ఇసుక అక్రమాల్లో తనకు భవిష్యత్తులో శిక్ష తప్పదనే ముందుగా ఓ ఫిర్యాదు పడేశాడన్నారు. గుండె ఆపరేషన్ వంకతో ఇంటినే కార్యాలయంలా మార్చుకున్న వెంకటరామిరెడ్డి రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారనిపేర్కొన్నారు. ఇసుక అక్రమాలు, బిల్లుల చెల్లింపులపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడని నక్కా ఆనంద్ బాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa