కృష్ణానది పక్కనే ఉన్నా నీళ్ళు దక్కని పరిస్థితి పల్నాడులో నెలకొందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చాలనే రూ.340 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామన్నారు. ఎన్నికలకు కేవలం నెల ముందు ఎటువంటి అనుమతులు లేకపోయినా గత పాలకులు మనల్ని మోసం చేసేందుకు కొబ్బరి కాయ కొట్టారని తెలిపారు. అటవీ శాఖ అనుమతులు అన్నీ తీసుకొచ్చామన్నారు. వైల్డ్ లైఫ్ అనుమతులు, భూములు ప్రొక్యూర్ చేసి శంఖుస్థాపన చేశామని జగన్ తెలిపారు.అందరినీ మోసం చేస్తూ గత పాలకులు అడుగులు వేశారన్నారు. అందుకే 175 నియోజకవర్గాలకు గాను 23 స్థానాలు మాత్రమే ఇచ్చారని జగన్ ఎద్దేవా చేశారు. దశల వారీగా ఈ ప్రాజెక్టును వినుకొండ, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు తీసుకెళతామన్నారు. పౌరుషాల గడ్డను అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. పల్నాడును జిల్లా చేయడంతో పాటు మెడికల్ కాలేజ్ ఇచ్చామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళల సాధికారత కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని జగన్ పేర్కొన్నారు. కోవిడ్ అతలాకుతలం చేసిందని... ఆదాయాలు తగ్గినా కూడా ఎవరి మీద సాకులు చెప్పలేదన్నారు. ఎంతటి కష్టకాలంలో కూడా సంక్షేమం ఆపలేదని జగన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa