విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి 9మంది అనుమానితుల్ని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఫేమస్ యూట్యూబర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న యూట్యూబర్ భార్యకు ఘనంగా శ్రీమంతం నిర్వహించారని.. స్నేహితులు పార్టీ అగడటంతో అక్కడ పార్టీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ తర్వాతే మంటలు అంటుకున్నాయని చెబుతున్నారు. అయితే బోటుకు మంటలు ఎలా అంటుకున్నాయన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
అయితే పార్టీ తర్వాత క్రాకర్స్ కాల్చడంతో ఈ ఘటన జరిగిందని.. పార్టీ సమయంలో వంట చేసుకుంటుండగా మంటలు అంటుకున్నట్లు రెండు రకాల ప్రచారం జరుగుతోంది. మంటలు అంటుకున్న బోటుకు లంగరు వదిలేయడంతో.. ఆ బోటు జట్టి నెంబర్ 1లో బోట్ల దగ్గరకు చెరుకోవడంతో భారీ ప్రమాదం జరిగింది అంటున్నారు. అంతేకాదు ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఫేస్ యూట్యూబర్ అక్కడే ఉండే వీడియో తీసి అప్లోడ్ చేశాడు.. ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో దగ్థమైన బోట్లలో ఒకటి యూట్యూబర్దిగా చెబుతున్నారు. ఈ యూట్యూబర్ కూడా స్థానికుడే.. ఆయన సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో వీడియోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారని చెబుతున్నారు. అలా మంచి పేరు సంపాదించారు. ఈ కేసులో యూట్యూబర్ను కేవలం అనుమానితుడిగానే అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.. దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించి విచారణ కూడా ముమ్మరం సాగుతోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. నేరుగా సీపీ రవిశంకర్ అయ్యర్ రంగంలోకి దిగారు. ఈ కేసును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన స్వయంగా ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఫిషింగ్ హార్బర్ రూమ్ నంబర్ 7 ఎదురుగా ఉన్న బాలాజీకి చెందిన బోట్లో ముందుగా మంటలు వ్యాపించినట్టు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. అలాగే ఫిషింగ్ హార్బర్లో సీసీ కెమెరా ఫుటేజ్ను సేకరించే పనిలో ఉన్నారు.
మరోవైపు బాధిత కుటుంబాలను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ పేర్ల రవిచంద్ర, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు పరామర్శించారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే సీఎం జగన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితుల్ని పరామర్శించాలని మంత్రి సీదిరి అప్పలరాజును ముఖ్యమంత్రి ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa