ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొనసాగుతున్న వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 07:12 PM

ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రాబోయే రెండు రోజులు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల పాటూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది అంటున్నారు.


తిరుపతి జిల్లా గూడూరులో 92.6 మిల్లీ మీటర్లు, నెల్లూరులో 86 , తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 71.2, తిరుపతి జిల్లా తడలో 50.4, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 33.8, నెల్లూరు జిల్లా రాపూరులో 21.6, తిరుపతి జిల్లా తొట్టెంబేడులో 20, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 18.4, కడప జిల్లా కోడూరులో 16.4, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 17.4, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 15.4, యానాంలో 14.4, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో 10


వాతావారణంలో మార్పులు సంభవించడంతో పాటు, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొన్నిచోట్ల ఈదురుగాలులు కారణంగా కోతకువచ్చిన వరిచేలు ఒరిగిపోయాయి. ఇప్పటికే అన్నిచోట్ల ముమ్మరంగా వరికోతలు సాగుతున్నాయి.. ఈ క్రమంలో వాతావరణంలో మార్పులు సంభవించడం వలన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యాన్ని మిల్లులకు పంపేవరకు టెన్షన్ తప్పదంటున్నారు.


కొన్ని జిల్లాల్లో మంగళవారం ఉదయం కురిసిన వర్షం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా.. ఇంకా పలు ప్రాంతాల్లో కోసిన వరిపంట పొలాల్లోనే ఉండిపోయింది. ఆలస్యంగా వరినాట్లు వేసిన ప్రాంతాల్లో పంట మరో వారం రోజుల్లో కోతకు వచ్చే దశలో ఉంది. ఇటువంటి సమయంలో పడిన వర్షంతో కోసిన వరి పనులు వర్షపు నీటతడిచిపోయాయి. వర్షం ఇంతటితో తగ్గితే పర్వాలేదని లేకుంటే ధాన్యం రంగుమారే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


వరి పనులు నీట తడవడంతో రెండు పార్లు తిరగవేయాల్పి ఉంటుందని.. దీనివల్ల తమపై అదనపు భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నేలనంటింది. నేలకు వాలిన పంటపై వర్షం కురవడంతో పంట మొలకెత్తే అవకాశముందని రైతులు చెబుతున్నారు. దీనివల్ల దిగుబడులు తగ్గే అవకాశం ఉందంటున్నారు. మరికొన్ని చోట్ల కోసిన ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టి పట్టాలు కప్పిఉంచారు. మరోవైపు మంగళవారం కురిసిన వర్షం కాయగూరలు, ఇతర మెట్ట పంటలకు మేలు చేకూర్చింది. కొంతకాలంగా వర్షాలు లేక మెట్టల్లో పంటలు ఎండిపోయే స్థితికి చేరుకోగా ప్రస్తుతం వర్షం వాటికి ఊపిరి పోసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa