వైసీపీ నేతలు చేపట్టిన సామజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ....వైయస్ఆర్సీపీ గుండె చప్పుళ్లయ్యారు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల ప్రజలు. ఈ శ్రీశైలం నియోజకవర్గంలో సంక్షేమపథకాల ద్వారా లబ్దిదారులకు డీబీటీ ద్వారా రూ.764 కోట్లు, నాన్డీబీటీ ద్వారా 284 కోట్ల రూపాయలు అందాయి. అంతేకాక అన్ని స్థాయిల్లో 60 శాతం పైగా పదవులు బలహీనవర్గాలకు అందాయి.సమాజంలోని అట్టడుగు వర్గాలను గుండెకు హత్తుకుని, సమానావకాశాలు కల్పిస్తున్నారు సీఎం జగనన్న. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే.ఈనాడు జరుగుతున్న అభివృద్ధి చూడలేని ప్రతిపక్షం గుడ్డిగా విమర్శిస్తోంది. జగనన్న హయాంలో గ్రామాల రూపురేఖలు మారాయి. సరికొత్త నిర్మాణాలు ఎన్నో వచ్చాయి. పల్లెపల్లెన ప్రగతిబాటలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూడలేని గుడ్డివాళ్లే విమర్శలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa