వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ....ఈరోజు సామాజిక సాధికార యాత్రకు తండోపతండాలుగా తరలివచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలను చూస్తుంటే, వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను అవమానించి,అవహేళనలు చేసి, చులకనగా చూసిన చంద్రబాబు రాజకీయం మనకు తెలుసు.అదే బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను అక్కున చేర్చుకుని, తన వారిగా స్వంతం చేసుకుని, వారి సంక్షేమం కోసం, వారి స్థాయి పెంచడం కోసం జగనన్న ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు.అణచివేతకు గురై, పేదరికంతో అల్లాడిపోతున్న ప్రజలపై అపార ప్రేమను చూపుతూ, సంక్షేమ పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, అలాగే అణగారిన వర్గాలకు చెందిన ప్రతి వెనుకబడిన కులాన్ని చేయిపట్టుకుని, ముందుకు నడిపిస్తున్న జగనన్న సామాజిక న్యాయానికి ప్రతీక అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa