అనంతపురం జిల్లాలో సరికొత్త దొంగతనం బయటపడింది. నార్పల మండలం కేశేపల్లిలో మహిళలు, ఓ వ్యక్తి ఇన్నోవా కారులో దర్జాగా వెళ్లి కస్టమర్స్లా బిల్డప్ ఇచ్చి చీరలతో పారిపోయారు. కేశేపల్లి మెయిన్ రోడ్డు పక్కనే కేశవ, జానకి దంపతులు నాలుగేళ్లుగా తమ ఇంట్లో చీరల వ్యాపారం చేస్తున్నారు. వీరి దగ్గరకు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇన్నోవాలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు వచ్చారు. తిరుపతిలో వివాహం ఉందని.. విలువైన పట్టు చీరలు కావాలని అడిగారు. ఆ ప్రకారం జానకీ విలువైన పట్టుచీరలు చూపించారు. సదరు మహిళలు రూ.1.50 లక్షలు విలువ చేసే 12 చీరలను సెలెక్ట్ చేశారు. తమకు తాగటానికి మంచినీళ్లు కావాలని అడగడంతో షాపు యజమాని ఇంట్లోకి వెళ్లగానే సదరు మహిళలు చీరలతో కారులో ఉడాయించారు. బాధితురాలు కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఇన్నోవా కారుకు నెంబరు ప్లేటు కూడా లేదని స్థానికులు చెబుతున్నారు. బాధితులు నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి ముందు సదరు మహిళలు, పురుషుడు వేరే షాపునకు వెళ్లారు. అక్కడ సీసీ కెమెరాలు ఉండటంతో వెనక్కి వచ్చారు. ఆ దృశ్యాలన్నీ అక్కడ రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa