పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతివ్వడాన్నికాపు సామాజిక వర్గం హర్షించదని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. వైయస్ఆర్ïసీపీ కి భావజాలం లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆమంచి కృష్ణమోహన్ తీవ్రంగా ఖండించారు. వైయస్ఆర్సీపీ అంటే దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనకు కొనసాగింపు అని ఉద్ఘాటించారు. జనసేన పార్టీ టీడీపీని అధికారంలోకి తేవాలని యత్నిస్తోంది. టీడీపీకి మేలు చేసేందుకు పవన్ అసత్యాలు మాట్లాడుతున్నారు. 2014–2019 మధ్యలో ఎలాంటి పాలన జరిగిందో, ఇప్పుడు ఎలాంటి పాలన జరుగుతుందో పోల్చుతూవైయస్ఆర్సీపీని విధానపరంగా వ్యతిరేకించాలన్నారు. కానీ ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ లైన్ దాటి మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి, వెంకటేశ్వరరావే రెండు సందర్భాల్లో టీడీపీని వ్యతిరేకించారు. అందుకే కదా ఇవాళ మీరు బీజేపీలో ఉన్నారని గుర్తు చేశారు. ఇవాళ పురంధేశ్వరి తీరును ఎవరూ కూడా ఒప్పుకోవడం లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa