ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 13, 2023, 07:40 PM

కడప జిల్లా, నిమ్మనపల్లి మండలంలోని అగ్రహరం వంతెన వద్ద వున్న బాహుదా కాలువలో పడి కె.విజయ్‌చంద్‌(38) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రామకృష్ణ వివరాల మేరకు చౌడేపల్లికి చెందిన కె.విజ య్‌చంద్‌ గత కొంతకాలంగా సైలాజికల్‌ వ్యాధితో భాదపడుతూ తిరుపతిలో చికిత్స చేసుకొంటున్నాడని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కొత్తపల్లి వెళుతుండగా పక్కనే ఉన్న బాహుదా కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారి పడినట్లు తెలిపారు. విజయ్‌ కనిపించక పోవడంతో బంధువులు అన్ని చోట్ల వెతకగా మంగళవారం ఉదయం బాహుదా కాలువ లో మృతదేహం ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఏరియా ఆప్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఆయనకు భార్య వెంకటమ్మ ఆలియాస్‌ ప్రసన్న, ఇద్దరు పిల్లలు లిల్లీజా స్మిన, సుభాష్‌ ఉన్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa