తెలుగుదేశం పార్టీతోనే ముస్లింలకు న్యాయం జరుగుతుందని, గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ముస్లింకు తీవ్ర అన్యాయం జరిగిందని పార్టీ కర్నూలు ఇన్చార్జి టీజీ భరత్ అన్నారు. బుధవారం నగరంలోని మౌర్యఇన్లో పరిణయ ఫంక్షన్ హాలులో ముస్లిం మైనార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ నగర కమిటీని ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడుగా అబ్దుల్ హమీద్, ఉపాధ్యక్షులుగా జుబేర్ ఆలీఖాన్, అబ్దుల్ రజాక్, షేక్ ఇమ్రాన్ సలీం, మహ్మద్ ముస్తఫా ఖాన్, ప్రధాన కార్యదర్శిగా మహ బూబ్బాషాలతో కలిపి మొత్తం 20 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికైన వీరికి నియామక పత్రాలను టీజీ భరత్ అందజేశారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీ ప్రజల ఓట్లన్నీ టీడీపీ పడేలా కొత్త కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆయా కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ మహిళలు, యువతల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అద్యక్షుడు నాగరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి జహంగీర్బాషా, సీనియర్ నేతలు మన్సూర్ ఆలీఖాన్, అబ్బాస్, మహబూబ్ ఖాన్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa