మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. వైసీపీలో నేతల బదిలీల అలజడి చోటు చేసుకోగా.. టీడీపీలో నిన్న (గురువారం) అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీకి చెందిన ఏలూరుకు చెందిన మాజీ మంత్రి,కదిరి వైసిపి నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరారు. అలాగే ఈరోునేడు చంద్రబాబు సమక్షంలో ఆరు నియోజకవర్గాల వైసీపీ నేతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నేడు రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి చంద్రబాబు సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరికలు జరుగనున్నాయి. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ నేతల్లో కలవరానికి గురిచేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa