ఆశ వర్కర్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహించిన 36 గంటల మహాధర్నా శుక్రవారం ముగిసింది. ఆశ వర్కర్ల ధర్నాకు తెలుగుదేశం పార్టీ పూర్తి సంఘీభావం ప్రకటించింది. ఆ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ.... జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, కేంద్ర ప్రాజెక్టుల్లో పనిచేసే స్కీమ్ వర్కర్లు, కార్మికులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష కట్టిందన్నారు. ప్రజలను హింసిస్తున్న జగన్మోహనరెడ్డిని తాడేపల్లి ప్యాలెస్కు సాగనంపాలన్నారు. రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమని, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa