ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క ఫోన్ కాల్‌తో రూ. రూ.6.11 లక్షలు పోగొట్టుకున్నాడు.. బీ అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 07:00 PM

ప్రకాశం జిల్లాలో సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఇద్దరు యువకులు మోసపోయారు. ఏకంగా రూ.6.11 లక్షలు పోగోట్టుకున్నారు. పెద్ద దోర్నాల మండలం అయినముక్కులకు చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డికి ఆన్‌లైన్‌ నేరగాళ్లు ఈ నెల 14న ఫోన్‌ చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బుల్ని అకౌంట్‌లో జమచేస్తాం, అకౌంట్‌ నెంబర్‌ చెబితే ఫోన్‌పే చేస్తామని చెప్పారు. తనది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ కాదని చెప్పి.. తన స్నేహితుడు లింగాల శ్రీనుకు ఫోన్‌ కలిపారు. వారు అతనితో మాట్లాడగా, తన ఖాతాలో డబ్బు లేదని చెప్పారు. దీంతో తన తమ్ముడు లింగాల రమేష్‌ ఖాతాలో నగదు ఉందని చెప్పి అతనికి ఫోన్‌ కలిపారు.


వారు ఫోన్‌ పే పాస్‌వర్డ్‌, ఆ తర్వాత ఓటీపీ నెంబర్‌ రమేష్‌ దగ్గర నుంచి తీసుకున్నారు. అనంతరం అతడి ఖాతాలో ఉన్న రూ.6.90 లక్షలు మాయం చేశారు. తమకు వచ్చిన ఫోన్‌ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అది స్విచ్చాఫ్‌ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. దీనిపై రమేష్‌ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు డబ్బులు తీసుకున్న వ్యక్తికి ఫోన్‌ చేసి గట్టిగా హెచ్చరించడంతో రూ.79 వేలు రమేష్‌ అకౌంటులో వేశారు. మిగిలిన రూ.6.11 లక్షలు వేయలేదు. దీంతో అతడు దోర్నాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై వారి నెంబర్లు పరిశీలించగా ఢిల్లీ, మధ్యప్రదేశ్‌కు చెందిన వారివిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్‌ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారన్నారు. డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని పోలీసులు హెచ్చరిస్తు్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa