ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 23న కడపలో పర్యటించనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 21, 2023, 09:45 PM

23.12.2023 ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం జగన్ కడప చేరుకుంటారు, అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ప్రారంభించి, చైర్మన్, ఉద్యోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత కడప రిమ్స్‌ వద్ద డాక్టర్ వైయ‌స్ఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దాంతోపాటు డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్‌ ప్రాంగణంలో డాక్టర్‌ వైయ‌స్ఆర్‌ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవం, ఆ తర్వాత ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్‌లైట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆధునికీకరించిన కలెక్టరేట్‌ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్‌ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ ప్రారంభిస్తారు, మరికొన్ని అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైయ‌స్ఆర్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa