మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27నుంచి సమ్మె చేయనున్నట్లు యూనియన్ అధ్యక్షుడు తులసేంద్ర తెలిపారు. బుధవారం ఆయన అధ్యక్షతన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఔట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కూల్ స్వీపర్ల రెగ్యులరైజేషన్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులకు, డ్రైవర్లకు ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, కార్మికులకు భద్రతా పరికరాలు, యూనిఫాం, సోపులు, చెప్పులు, నూనె మంజూరు, హైకోర్టు ఆదేశాల మేరకు టైంస్కేల్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.యూనియన్ ఉపాధ్యక్షుడు మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి దొరస్వామి, గురప్ప, వంశీ, ఇందుమతి, తాతారావు, షణ్ముగం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa