ఏపీలో ఎస్సై ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. ఎంతోమంది యువత అర్హత సాధించారు. అయితే విజయనగరం జిల్లాలో ఓ యువకుడు మాత్రం ఏడు ఉద్యోగాలు వచ్చినా వదులుకున్నాడు.. ఆ తర్వాత తన లక్ష్యమైన ఎస్సై ఉద్యోగాన్ని సాధించారు. గరివిడి మండలం ఏనుగువలసకు వెంపడాపు ఈశ్వరరావు.. రెండు రోజుల కిందట విడుదలైన ఫలితాల్లో గుంటూరు రేంజ్ పరిధిలో సివిల్ ఎస్సైగా ఎంపికయ్యారు. ఈశ్వరరావుది నిరుపేద కుటుంబం.. తల్లిదండ్రులు కృష్ణ, నరసమ్మ కష్టపడి కుటుంబాన్ని పోషించారు. పేదరికం కారణంగా ఈశ్వరరావు చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే జరిగింది. పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారు. బీఎస్సీ పూర్తి చేశాక ఎస్సై ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తండ్రి పక్షవాతంతో మంచాన పడటంతో.. ఐదేళ్లపాటు లేవలేని స్థితిలో ఉండడంతో కుటుంబ బాధ్యత ఈశ్వరరావుపై పడింది. తండ్రి మరణంతో 2014లో ఉపాధి హామీ క్షేత్రసహాయకుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు.
కొన్నాళ్లపాటు ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలో పనిచేశాడు. తల్లి, బావ పైల రామచంద్రరావు సహకారం అందించారు. అక్కడి నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశారు. కాకినాడలోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటూ కొన్నాళ్లపాటు ఆ కేంద్రంలోనే ట్రైనర్గా కూడా పనిచేశారు. 2018 నుంచి 2023 వరకు వరుసగా ఎనిమిది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2018లో ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఉద్యోగం రాగా.. అదే ఏడాది గ్రూప్-డిలో రైల్వేలో గ్రౌండ్ పాయింట్మెన్గా ఎంపికయ్యారు. గుంటూరు డివిజన్లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా వచ్చింది. ఆ తర్వాత 2019లో గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు సచివాలయంలో శానిటరీ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఉద్యోగాలు వచ్చాయి. 2022 గ్రూప్-డిలో రైల్వే పాయింట్మెన్ జాబ్ కూడా వచ్చింది. ఎస్సై ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని.. ఏ ఉద్యోగంలో చేరలేదు. 2022లో ఆర్ఆర్బీ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపి రైల్వేలో ట్రైన్ మేనేజరు ఉద్యోగాన్ని సంపాదించారు. కుటుంబ సభ్యులంతా ఒత్తిడి తేవడంతో ఆ ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగం చేస్తూ మళ్లీ ఎస్సై ఉద్యోగంపై ఫోకస్ పెట్టారు. ఆ లక్ష్యంగా దిశగా ప్రయత్నిస్తే.. 2018లో ఒక్క మార్కు తగ్గడంతో ఉద్యోగం రాలేదు. ఇప్పుడు తన కల నెరవేర్చుకున్నారు ఈశ్వరరావు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa